కాంగ్రెస్ ను ప్రగతి భవన్ లో తాకట్టు పెట్టేందుకే…

0
36

దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు టిఆర్ఎస్, కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదని ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన కామెంట్స్ పై రఘునందన్ స్పందించారు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల నా ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని ప్రశ్నించారు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారని ఆరోపించారు. గజ్వేల్,సిద్దిపేట,సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ ఒప్పుకున్నాడు కదా అన్నారు. బాల్క సుమన్ కల్వకుంట్ల కుటుంబానికి బానిస సుమన్ అని ఎద్దేవా చేశారు. నువ్వొక్కడివే ఉద్యమం చేయలేదని గుర్తు పెట్టుకోవాలన్నారు. తెలంగాణ రావడానికి బీజేపీ కూడా కారణమే అన్నారు. అభివృద్ధి మీద,ఆత్మ గౌరవం మీద చర్చకు సిద్ధం అని సవాల్ చేశారు.

ఆంధ్ర నుండి వచ్చిన వారి కాళ్లకు ముళ్ళు కుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నది ఎవరు? రోజా గారి ఇంటికి వెళ్ళింది ఎవరు? భోజనము చేసింది ఎవరు? చెప్పాలన్నారు. రాయలసీమ ను రతనాల సీమ చేస్తా అన్నది ఎవరో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతున్నది లంకలో పుట్టినోళ్లు అంతా రాక్షసులే అనడం చూస్తే మరోసారి సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలకు ఎందుకు అపాయింట్ మెంట్ దొరికిందో చెప్పాలన్నారు. బి టీం కాబట్టే వారికి అపాయింట్ మెంట్ దొరికిందని విమర్శించారు. హుజూరాబాద్ లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి అపాయింట్ మెంట్ దొరికిందన్నారు. కాంగ్రెస్ ను ప్రగతి భవన్ లో తాకట్టు పెట్టేందుకే వాళ్లు అక్కడికి వెళ్లారని విమర్శించారు రఘునందన్ రావు.