చంద్రబాబుకు మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి

చంద్రబాబుకు మరోసారి క్లారిటీ ఇచ్చిన విజయసాయిరెడ్డి

0
30

విక్రమార్కుడు-భేతాళ కథల్లోని భేతాళుడితో పోల్చదగ్గ వ్యక్తి చంద్రబాబు అని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు… రకరకాల మ్యానిప్యులేషన్లతో తప్పించుకుంటూ వస్తున్నారని ఆరోపించారు. చేసిన తప్పుల నుంచి శాశ్వతంగా ఎవరూ బయట పడలేరని త్వరలోనే ఆయనకు అర్థమవుతుందని తెలిపారు. కుతంత్రాలతో ప్రజలను రెచ్చగొట్టి తను రక్షణ పొందాలని చూస్తున్నారని విజయసాయిరెడ్డి ఆరోపించారు

ఇన్ సైడర్ ట్రేడింగులో భూములు చౌకగా కొట్టేసిన ఎలుకలన్నీ కలుగుల్లో నుంచి బయటి కొస్తున్నాయని ఆరోపించారు. పరువు నష్టం దావా వేస్తామని, దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండని సవాళ్లు విసురుతున్నారని… సిఐడి లేదా సిబిఐతో దర్యాప్తు జరిపించమని లేఖలు రాయండి మీరు నిప్పులో తుప్పులో తేలుతుందని అన్నారు…

తీసేసిన తాసిల్దార్లంతా పళ్లు పటపట కొరుకుతున్నారని విషం కక్కడంలో పోటీలు పడుతున్నారని అన్నారు. జగన్ మోహన్ రెడ్డి నివాసం మీ హయాంలోనే పూర్తయిందని తెలిపారు….అనుమతి లేకపోతే అప్పుడు నోళ్లెందుకు పెగల్లేదని ప్రశ్నించారు. లింగమనేని గెస్ట్ హౌజులా నదిని పూడ్చి కట్టింది కాదని హితవుపలికారు… తోక కనిపించకున్నా అదిగో పులి అనే బ్యాచ్ తయారైందని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

అంతేకాదు ఎలక్షన్ల ముందు కూడా ఇలాగే దుష్ప్రచారం చేశారని గుర్తు చేశారు… జగన్ సిఎం అయితే భూములు లాక్కుంటారని, ఇళ్లలోంచి వెళ్లగొడతారని, రౌడీరాజ్యం వస్తుందని భయానక దృశ్యాలు చూపించారు. ప్రజలు మిమ్మల్నే అధికారం నుంచి విసిరి కొట్టి బుద్ధి చెప్పారు. అయినా అవే గోబెల్స్ ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు విజయసాయి రెడ్డి