చంద్రబాబు నాయుడు సర్కార్ కు మరో లేఖ

చంద్రబాబు నాయుడు సర్కార్ కు మరో లేఖ

0
27
Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai. *** Local Caption *** Andhra Pradesh CM, Chandrababu Naidu in Marriott, Mumbai during an event organised by Microsoft on Wednesday. Express Photo by Nirmal Harindran. 22.02.2017. Mumbai.

లాక్ డౌన్ కారణంగా చేతికొచ్చిన పంటను అమ్ముకోలేక రబీ, ఉద్యాన రైతులు, ఉత్పత్తిని అమ్ముకోలేక ఆక్వా సాగుదారులు కష్టాలు పడుతున్నారని అన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విరక్తితో కొందరు చేజేతులా పంటను నాశనం చేసుకుంటుంటే, మరి కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బాధపడ్డారు..

కాబట్టి కనీస మద్దతుధరకు ఉత్పత్తులు కొని ఆదుకోవలసిందిగా కోరుతూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు చంద్రబాబు నాయుడు.. అలాగే ఏయే ప్రాంతాలలో ఏ పంట ఎంత పండిందీ, ప్రభుత్వం గత 2 నెలల్లో ఎంత కొనుగోలు చేసిందీ, మండల, జిల్లా స్థాయి నివేదికలను ప్రజల ముందు ఉంచమని ప్రధాన కార్యదర్శిని చంద్రబాబు నాయుడు కోరారు..