చంద్రబాబుకు రివర్స్ లో మరో ఉద్యమానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ

చంద్రబాబుకు రివర్స్ లో మరో ఉద్యమానికి గ్రీస్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ

0
32

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ఉద్యమానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది… ఉత్తరాంధ్ర అభివృద్దిని అడ్డుకునే వారు ఎవరైనా ఉద్యమ చక్రాలకింద నలిగిపోవాల్సిందేనని అన్నారు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్…

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు ఉద్యమం చేస్తామని అన్నారు… రాజధానిని ఎవ్వరు ఆపలేరని అన్నారు… ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కచ్చితంగా అమలు చేస్తారని అన్నారు…

అలాగే చంద్రబాబుకు కూడా వార్నింగ్ ఇచ్చారు… ఉత్తరాంధ్ర గోడు, ఆకలి, పేదరికం కనిపించడంలేదా తమాషాలు చేస్తున్నావా అని అన్నారు… చంద్రబాబును అరెస్ట్ చేశారని అంటున్నారు… గతంలో ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి ఏం తప్పు చేశారని ఎయిర్ పోర్ట్ లో అరెస్ట్ చేశారని ప్రశ్నించారు… మరోవైపు అవంతి కూడా హెచ్చరించారు… రాజధాని మర్చితే విప్లవం వస్తుందని అంటున్నారని మార్చకుంటే కూడా విప్లవం వస్తుందని అన్నారు..