ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త

0
42

ఏపీ ప్రజలకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. ఇప్పయివరకు నవరత్నాల్లో భాగంగా అర్హులైన వారందరికీ పథకాల ద్వారా లబ్ది పొందారు. కానీ కొంతమంది వివిధ కారణాల చేత వీటిని పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు సీఎం.

అర్హులై ఉండి ఏ కారణం చేతనైనా మిగిలిపోయిన లబ్ధిదారులకు పథకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. నేరుగా వారి ఖాతాల్లోకి నగదును జమ చేశారు. 2,99,085 మందికి వైయస్సార్‌ పెన్షన్‌కానుక వర్తింపు, కొత్త సామాజిక పెన్షన్ల వల్ల ఏటా రూ.935 కోట్ల రూపాయల భారం పడుతుందని చెప్పారు.

కొత్తగా 7,051 మందికి బియ్యం కార్డులు ఇస్తున్నామని.. కొత్తగా 3,035 మందికి వైయస్సార్‌ ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తున్నట్లు చెప్పారు. అర్హత ఉండి కూడా ఏ ఒక్కరుకూడా మిస్‌కాకూడదని.. దీనికోసమే తపన, తాపత్రయం పడుతున్నాం అని సీఎం జగన్ అన్నారు.