సీఎం జగన్, విజయసాయిరెడ్డిలపై బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్…

సీఎం జగన్, విజయసాయిరెడ్డిలపై బుద్దా వెంకన్న హాట్ కామెంట్స్...

0
38

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అలాగే ఎంపీ విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు… ఈ మేరకు ట్వీట్ కూడా చేశారు… వీరిద్దరు పొరపాటున గ్రామాల్లోకి వెళ్ళకండి అర్ధం అవుతుందా?రైతులు అరిగిపోయిన చెప్పులు పట్టుకొని తిరుగుతున్నారని అన్నారు.అన్న వస్తాడు ప్రతి రైతుకి ఏడాదికి లక్ష రూపాయిలు ప్రభుత్వ సహాయం అందుతుంది అని ఎన్నికల ముందు ఊదరగొట్టారు..

పంట వెయ్యకముందే గిట్టుబాటు ధర ప్రకటిస్తాం అన్నారు….ఏమి అయ్యాయి మీ హామీలు ఆఖరికి పండిన పంట రవాణా చేసుకునే వసతులు కూడా కల్పించలేని దద్దమ్మ ప్రభుత్వం,రైతులు పండించిన పంటని పొలాల్లోనే పారబోస్తున్నారు కనీస ఏర్పాట్లు కూడా చెయ్యకుండా రైతులను జీవిత కాలం దెబ్బతీశారు.

రైతు భరోసా లో 5 వేలు కోసారు.అన్ని కోనేసాం అంటున్నావు అంటున్నావ్ ఏంటి అవి సాయి రెడ్డి గారు సన్న బియ్యం అని గడ్డ కట్టిన బియ్యం ప్రజలకు పంచారు అవేనా వేల కోట్లు దోపిడీ చేసి జగన్ రెడ్డి కొన్న నూక బియ్యం అని మండిపడ్డారు బుద్దా వెంకన్న…