ప్రధాని మోదీ ఆస్తుల విలువ ప్రకటన..ఎన్ని కోట్లో తెలుసా?

0
44

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆస్తుల వివరాలు తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. మామూలుగా రాజకీయ నాయకులూ తమ ఆస్తుల వివరాలను వెల్లడిస్తుంటారు. అలాగే ప్రధాని మోడీ కూడా ప్రతి ఏడాది తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడిస్తున్నారు.

2021-22 సంవత్సరంలో మోదీ చరాస్తుల విలువ రూ. 26.13 లక్షలు పెరిగినట్టు పీఎంఓ వెబ్​సైట్ వెల్లడించింది. గుజరాత్ రెసిడెన్షియల్ ప్లాట్‌లో ఆయనకు ఉన్న వాటాను విరాళంగా ఇచ్చారని, దీంతో ఆయన పేరిట ఎలాంటి స్థిరాస్తులు లేవని పేర్కొంది. మోదీతో పాటు పలు కేంద్ర మంత్రుల ఆస్తుల జాబితాను ప్రకటించింది.

మార్చి 31, 2022 వరకు మోదీ చరాస్తుల విలువ రూ.2,23,82,504కు చేరిందని పీఎంఓ తెలిపింది. ఇందులో డిపాజిట్ల పెరుగుదల, ఆర్థిక సంస్థ స్థిరత్వం, నేషన్‌వైడ్ ఫైనాన్షియల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌లు, జీవిత బీమా కవరేజ్, బీమా పాలసీలు, నగదు ఉన్నాయని చెప్పింది.