ప్రయాణికులకు TSRTC అదిరిపోయే ఆఫర్లు..పూర్తి వివరాలివే..

0
43

ఆర్టీసీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత సజ్జనార్ వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు అనేక ఆఫర్లు తీసుకొస్తున్నారు. ఇక తాజాగా ప్రయాణికులకు TSRTC అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్వాతంత్య్ర దినోత్సవ వజ్రోత్సవాల సందర్భంగా పలు ఆఫర్లను ప్రకటించింది. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఆగస్టు 15న 75 ఏళ్లు దాటిన వృద్దులకు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు.

అలాగే ఆగస్టు 15న పుట్టిన పిల్లలకు 12 ఏళ్లు వచ్చేవరకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు.

అదేరోజు 120 రూపాయలు ఉన్న డేపాస్‌..కేవలం 75 రూపాయలకే అందించాలని నిర్ణయించారు.

టీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం వెళ్లాలనుకునే భక్తులకు ఈనెల 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు 75 రూపాయలు డిస్కౌంట్‌ ఇవ్వాలని నిర్ణయించారు.

ఆగస్టు 15న కిలో బరువు ఉండి 75 కిలోమీటర్ల దూరం వరకు అన్ని కార్గో పార్శిళ్లను ఉచితంగా చేరవేయాలని నిర్ణయించారు.

దూర ప్రాంతాలకు రెగ్యులర్​గా ప్రయాణించే 75 మంది ప్రయాణికులకు.. తర్వాత చేసే ప్రయాణానికి సంబంధించిన ఒక ఉచిత టికెట్​ను అందజేస్తామని చెప్పారు.

75 ఏళ్ల లోపు ఉన్న వారికి 750 రూపాయలకే హెల్త్ ప్యాకేజీతో పాటు.. మందులపై 75శాతం మందుల కొనుగోలుపై రాయితీ అందించనున్నారు.