ఎవరికి డ్వాక్రా డబ్బులు వస్తాయి ఎవరికి రావు ఇది చదవండి

ఎవరికి డ్వాక్రా డబ్బులు వస్తాయి ఎవరికి రావు ఇది చదవండి

0
41

డ్వాక్రా మహిళలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ ఆసరా పథకం ప్రయోజనం అందిస్తున్నారు. ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి బకాయిలు లేని సంఘాలకు సున్నా వడ్డీ పథకం అమలు చేస్తున్నారు. అర్హులైన పొదుపు మహిళల జాబితాను అధికారులు ప్రభుత్వానికి అందచేశారు. . 2020 జనవరిలో మొదటి విడత మాఫీ నిధులు విడుదల చేయనుంది జగన్ ప్రభుత్వం

ఇక అంతేకాకుండా వారు ఆర్దికంగా నిలదొక్కుకోవాలని, ఇవి అప్పులు తీర్చుకునేందుకు వాడకుండా వ్యాపారాలకి ఆర్దికంగా ఎదిగేందుకు వాడుకోవాలి అని చెబుతున్నారు, ఇలా అప్పులు తీర్చుకుంటే ఆర్దికంగా బలపడలేరు అని తెలియచేశారు ప్రభుత్వ అధికారులు. నాలుగు ధఫాలుగా ఇచ్చే ఈ డబ్బు వల్ల మాకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు మహిళలు, అయితే ఈ డబ్బులు కేవలం ఆలస్యం చేయకుండా ఎవరు డబ్బులు కడుతున్నారో వారికి మాత్రమే ఇస్తాం అని తెలియచేశారు.

సక్రమంగా పొదుపు చేస్తే ఏప్రిల్ లో నమోదు అయిన గ్రూపులు అందరికి ఇస్తాము అని తెలిపారు..12.04-19 తర్వాత కొత్తగా వచ్చిన డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ ఉండదు అని చెప్పారు, ఇక నవశకంలో మీ పేర్లు నమోదు చేసుకోవాలి అని తెలిపింది ప్రభుత్వం.