Breaking News- ఏపీ సచివాలయ ఉద్యోగులకు గుడ్ న్యూస్

0
39

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్‌కు సంబంధించిన జీవోను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని పరీక్ష పాస్ అయిన వారందర్నీ ప్రొబేషన్ డిక్లరేషన్ చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగిస్తూ ప్రభుత్వం జీవోఎంఎస్‌ నెంబర్ 5ను శనివారం జారీ చేసింది.

ఇక, సచివాలయ ఉద్యోగుల పే స్కేల్ ఖరారు చేసింది ఏపీ ప్రభుత్వం. పంచాయతీ సెక్రటరీ, వార్డ్ సెక్రటరీ లకు బేసిక్ పే రూ. 23,120 నుంచి రూ. 74,770 ఖరారు చేయగా.. ఇతర సచివాలయ ఉద్యోగులకు బేసిక్ పే రూ. 22,460 నుంచి రూ. 72,810 ఖరారు చేసింది.

ఏపీలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 15 వేల పైగా ఉన్న గ్రామ సచివాలయాల్లో దాదాపు లక్షా 15వేల మందికి పైగా ఉద్యోగులను నియమించింది. 2019 అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాయ వ్యవస్థ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే.