ఫిబ్రవరిలో దగ్గుబాటి కుటుంబానికి గుడ్ న్యూస్

ఫిబ్రవరిలో దగ్గుబాటి కుటుంబానికి గుడ్ న్యూస్

0
29

పర్చూరులో వైసీపీ ఓటమి పాలైంది.. అయితే అక్కడ దగ్గుబాటి కుటుంబానికి బాధ్యతలు ఇవ్వకుండా రామనాధం బాబుకి పార్టీ బాధ్యతలు మళ్లీ అప్పగిచారు జగన్.. అయితే దగ్గుబాటి కుటుంబాన్ని ఎందుకు ఇలా దూరం పెడుతున్నారు అంటే ఆయన కుమారుడు అంత యాక్టీవ్ గా రాజకీయాలు చేయడం లేదు అంటున్నారు.

అయితే ఇటు పురందేశ్వరి బీజేపీలో ఉంటూ ఇటు వెంకటేశ్వరరావు ఆయన తనయుడు వైసీపీలో ఉండటంతో విమర్శలు వస్తున్నాయి.. అందుకే ఆయన సైలెంట్ అయ్యారట… తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం దగ్గుబాటిక ఫిబ్రవరిలో భర్తీ అయ్యే ఎమ్మెల్సీ ఖాళీల్లో ఆయనకు కూడా అవకాశం ఇవ్వనున్నారట.

అయితే అప్పటి వరకూ ఆయన పార్టీ మారే ఆలోచన చేయరు అని చెబుతున్నారు …అయితే గెలిచి ఉంటే కచ్చితంగా సీనియర్ గా భావించి ఆయనకు స్పీకర్ పదవి ఇచ్చేవారు జగన్… కాని వెంటనే ఎమ్మెల్సీ అంటే ఆయన గతంలో మైనార్టీలకు ఇస్తాను అని మాట ఇచ్చారు కాబట్టి, ఆ తర్వాత దగ్గుబాటి వంతు అని తెలుస్తోంది, అందుకే ఫ్రిబ్రవరిలో గుడ్ న్యూస్ దగ్గుబాటి కుటుంబానికి వినిపిస్తారట