బాబుకు వంశీతో మరో చెక్ ప్లాన్ చేసిన జగన్

బాబుకు వంశీతో మరో చెక్ ప్లాన్ చేసిన జగన్

0
31

అసెంబ్లీ సమావేశాల సమయంలో తెలుగుదేశం అనేక అంశాలను ఎంచుకునేందుకు సిద్దం అవుతోంది..ఈ సమయంలో ఎవరైనా పార్టీకీ గుడ్ బై చెబితే? తాము వైసీపీపై చేద్దామనుకున్న విమర్శలు టార్గెట్ అంతా మిస్ అవుతుంది అని మరో డైలామా టీడీపీలో ఉందట.. జగన్ వేసే అడుగు అర్ధం కావడం లేదు. అసలు వంశీ వైసీపీలో చేరుతా అని ప్రకటించారు, కాని టీడీపీకి రాజీనామా చేయకపోవడానికి కారణాలు మాత్రం తెలియడం లేదు.

ముఖ్యంగా చంద్రబాబు అదే ఆలోచిస్తున్నారు.. జగన్ గతంలో చంద్రబాబు చేసిన ఫిరాయింపులు చేయను అన్నారు. మరి వంశీ అసెంబ్లీకి వస్తే తెలుగుదేశం వైపు ఉంటారా వైసీపీ వైపు ఉంటారా లేదా స్వతంత్య్రంగా ఉంటారా అనేది అనుమానమే.

అయితే స్పీకర్ కు రాజీనామా లేఖ ఇచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటారు.. కాని అసెంబ్లీ సమావేశాల్లో మాత్రం కచ్చితంగా వంశీ అంశం తెరపైకి తీసుకువస్తారు అనే అంటున్నారు, బహుశా వంశీనే కొన్ని విషయాలు అసెంబ్లీలో మాట్లాడినా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు మేధావి వర్గం.