టీడీపీ ఫైర్ బ్రాండ్ రాజకీయ సన్యాసం

టీడీపీ ఫైర్ బ్రాండ్ రాజకీయ సన్యాసం

0
31

రాజకీయాల్లో తాను పోటీ చేయకుండా ఉండేందుకు రాజకీయ సన్యాసం తీసుకున్నానని స్పష్టం చేశారు ప్రధాన ప్రతిక్ష తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి… తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

జగన్ పరిపాలన జనరంజకంగా సాగుతోందని అన్నారు… అందుకే ఆయన పరిపాలనకు 100కు 150 మార్కులు వెయ్యాలని సెటైర్ వేశారు…. ఇప్పటి ఎప్పటికీ జగన్ తమ అబ్బాయేనని అన్నారు… ప్రస్తుతం జగన్ పరిపాలనలో కిందా మీద పడుతున్నారని అన్నారు…

రాష్ట్రంలో ఎన్నో బస్సులు ఉన్నాయని కానీ ఆయనకు తమ బస్సులే కనిపిస్తున్నాయని అన్నారు… ఇప్పటి వరకు 31 బస్సుల సీజ్ చేశారని అన్నారు ఫైన్ కడితే సరిపోయే దానికి సీజ్ చేశారని అన్నారు… దీనిపై న్యాయపరంగా పోరాడుతామని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు…