లాక్ డౌన్ వేళ జంతువుల కోసం ప్రత్యేక విమానం ఎందుకంటే

లాక్ డౌన్ వేళ జంతువుల కోసం ప్రత్యేక విమానం ఎందుకంటే

0
35

లాక్ డౌన్ వేళ చిక్కుకుపోయిన వారిని సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఇప్పటికే అనేక విమానాలు ఏర్పాటు చేస్తున్నారు, అయితే మనుషులకే కాదు జంతువులని కూడా చాలా మంది మిస్ అవుతున్నారు, తమ పెట్ ని చూడటానికి లేదు అని చాలా రోజులు అయింది అని అనేక మంది రిచ్ కిడ్స్ కన్నీరు పెడుతున్నారు.

ఈ నేపథ్యంలో అక్రిషన్ ఏవియేషన్ అనే ఓ ప్రైవేట్ జెట్ సంస్థ కేవలం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేకంగా ఒక విమానాన్ని ప్రారంభించింది. ఆ విమానంలో మొత్తం ఆరు సీట్లు ఉంటాయి. ఆరు పెంపుడు జంతువుకు అందులో ప్రయాణించే అవకాశం ఉంటుంది. అయితే ఇదేమీ మన విమానాల టికెట్ ధర కాదు.. దానికి ఐదు రెట్లు చార్జ్ చేస్తున్నారు.

9 లక్షల 60 వేలు దీని ట్రిప్ కాస్ట్ అంటే , ఒక్కో సీటు ధర రూ. లక్షా 60వేలుగా నిర్ణయించారు. ప్రస్తుతానికి విమానంలోని నాలుగు సీట్లు బుక్ అయ్యాయి. ఇందులో మూడు కుక్కలు ఓ పక్షి ఉన్నాయి,మరో రెండు బుక్ అయితే ఇవి స్టార్ట్ అవుతాయట.