లోకేశ్ అభినందనలు..

లోకేశ్ అభినందనలు..

0
41

స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా నాలో లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు… పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడుకి సేవ చేసినట్టే అని అన్నారు.. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం తనకు దక్కిందని గుర్తు చేసుకున్నారు…

పల్లెల సమగ్రాభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేశానని అన్నారు లోకేశ్. గ్రామాల్లో 24 వేల కిలోమీటర్ల సీసీ రోడ్లు, 32 లక్షల ఎల్ఈడీ వీధి దీపాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్వచ్ఛమైన తాగునీరు కోసం ఎన్టీఆర్ సుజల ప్లాంట్లు ఏర్పాటు చేశామని అన్నారు..

ఉపాధి హామీ పధకంలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచామని అన్నారు. గ్రామాల అభివృద్ధిలో నిరంతరం భాగస్వామ్యం అవుతున్న సిబ్బంది,అధికారులు,ప్రజలందరికీ నా అభినందనలు అని అన్నారు…