జగన్ పై లోకేశ్ సంచలన కామెంట్స్

జగన్ పై లోకేశ్ సంచలన కామెంట్స్

0
178

85లక్షల మంది రైతులకు అక్షరాల రూ.12500 ఇస్తామని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని నారా లోకేశ్ గుర్తు చేశారు అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు…

మీరన్నమాట మళ్లీ ఒకసారి చూడండి విడతల ముఖ్యమంత్రి జగన్ గారూ అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు లోకేశ్. ఏరు దాటి తెప్ప తగలబెట్టినట్లు ఇప్పుడు కేవలం 40 లక్షలమందికే రైతుభరోసా ఇచ్చారని అన్నారు…

అది కూడా ఇచ్చేది కేవలం రూ.7500 రూపాయలు మాత్రమే అని లోకేశ్ మండిపడ్డారు. రైతులకు రుణమాఫీ రద్దు చేశారు, ఇప్పుడు 45లక్షలమంది రైతులకు కనీస సాయం కూడా రాలిపోయిన రత్నమేగా ప్రశ్నించారు లోకేశ్