ప్రధాని మోడీ భేటీపైనే అందరి ఆసక్తి….

ప్రధాని మోడీ భేటీపైనే అందరి ఆసక్తి....

0
33

భారత్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆందోళన కల్గిస్తుంది… ఇప్పటికే మూడు లక్షలు దాటిన కరోనా కేసులు జూలై నాటికి పదిహేను లక్షలకు చేరువవుతాయని నిపుణులు హెచ్చరికతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది… ప్రధాని మోడీ సీనియర్ మంత్రులతో సమావేశం అయ్యారు… లాక్ డౌన్ మినహాయింపులు కరోనా పరిస్థితిపై ప్రధాని మోడీ సమీక్షించారు…

కరోనా వైరస్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతపై మంత్రులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు… ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్, వంటి రాష్ట్రాల్లో కేసులు సంఖ్య ఆగడంలేదు… మహారాష్ట్రలో లక్షకు పైగా కేసులు నమోదు అయ్యాయి…. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై నరేంద్ర మోడీ చర్చలు జరిపారు…

ప్రధానంగా కమ్యునిటీ వ్యాప్తి ఉందేమోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది… ఇలాగే కొనసాగిస్తే రానున్న మూడు నెలల కాలం గుడ్డు కాలమిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఈరోజు రేపు,మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు… ఈ భేటీ ముఖ్యమంత్రుల అభిప్రాయాన్ని కూడా తెలుసుకోనున్నారు…