ప్రియాంకరెడ్డి హత్యపై విజయశాంతి సంచలన పోస్ట్

ప్రియాంకరెడ్డి హత్యపై విజయశాంతి సంచలన పోస్ట్

0
37

తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఈ దారుణమైన రేప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి, ముఖ్యంగా పసిపిల్లలపై కూడా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు.. వరంగల్ లో మానస, అలాగే షాద్ నగర్ లో ప్రియాంకరెడ్డి, ఈ రెండు ఘటనలు మరువక ముందే మరో అమ్మాయిని అతికిరాతకంగా చంపేశారు, అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్ విజయశాంతి స్పందించారు. తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ పెట్టారు.

“ఇది భాగ్యనగరానికి గర్భశోకం… మదమెక్కిన మగ పిశాచుల దాష్టీకానికి మాతృహృదయం చిద్రం. ఇది ప్రియాంకం కాదు.. సభ్య సమాజానికి కళంకం. విధి నిర్వహణకు వెళ్లిన వైద్యురాలు విధి వంచితు రాలైపోయింది… కామాంధుల కర్కశం తో కన్నుమూసింది. హైటెక్ పరిసరాల్లో, హై సెక్యూరిటీ జోన్లో జరిగిన ఘోరం.. హాహాకారాలు పెట్టినా పట్టించుకోని వైనం. తెలంగాణ సభ్య సమాజానికి తీరని అవమానం.

1985లో ఈ ధుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో… అనే పదాల ద్వారా మహిళా వ్యధార్థుల ఆక్రోశాన్ని ప్రతిఘటన ద్వారా ఎంత బాధతో నా ప్రజలకు తెలియజేసుకున్నానో అంతకు వేయింతల ఆవేదనతో వరంగల్ మానస, హైదరాబాద్ ప్రియాంకల విషయమై రాస్తున్న మాటలివి.

అమ్మల కడుపున పుడుతున్న అన్నదమ్ములారా… ఇంతటి ఘాతుకాలకు తెగబడేముందు ఒక్క క్షణం మిమ్మల్ని కని, పెంచిన అమ్మ, తోడబుట్టిన అక్కచెల్లెళ్ళు, కడుపున పుట్టిన ఆడబిడ్డలు ఎందుకు ఆలోచనకు రావటం లేదు? అంతేకాదు.. అప్పటి వరకూ గౌరవంగా, సంతోషంగా గడిచిన మీ జీవితాలు, చీత్కరించబడుతూ, అసహ్యంతో నేరస్తులుగా జన్మంతా బతికే స్థితికి దిగజారిపోతాయని ఎందుకు తెలుసుకోవడం లేదు?

మగపిల్లలను కనాలంటే… కాబోయే అమ్మలు వద్దని అబార్షన్స్ చేయించుకునేంత దౌర్భాగ్యాన్ని దయచేసి సృష్టించకండి. అంటూ తన ఆవేదన తెలియచేశారు.