Breaking: ఎంపీ ఇంటి ముందు రైతుల నిరసన..

0
36

తెలంగాణాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిజెపి నేత, నిజామాబాద్ పార్లమెంటు సభ్యులు ధర్మపురి అరవింద్ కు ఊహించని షాక్ తగిలింది. రైతులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి అరవింద్ ఇంటిని చుట్టుముట్టి నినాదాలతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేసారు. వడ్లు కొనాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్ముర్ సమీపంలో చోటు చేసుకుంది.