వడ్లు కొనేవరకూ వదిలేది లేదు..రేవంత్ రెడ్డి

0
39

ఈ రోజు మధ్యాహ్నం జరిగే రాష్ట్రమంత్రి వర్గ సమావేశంలో ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వడ్ల కొనుగోలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వదిలేది లేదన్నారు రేవంత్ రెడ్డి. రెండు ప్రభుత్వాల దుర్మార్గాలను ఎండగడుతూనే ఉంటామని తెలిపారు. వడ్లు కొనే వరకు పోరాడుతూనే ఉంటామని హెచ్చరించారు. తెలంగాణలో చివరి గింజ వరకు పంటను కొనాల్సిందేనని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు.

24గంటల్లో రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచి కొనుగోలును ప్రారంభించాలని ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఒక స్పష్టమైన వైఖరి తీసుకొని రైతులకు భరోసా కల్పించకపోతే ఎక్కడిక్కక్కడ మంత్రులను, టీఆర్ ఎస్ నేతలను అడ్డుకుంటాం అని మండిపడ్డారు. మద్దతు ధరలకు ధాన్యం కొనుగోలు చేపట్టాలి అని ఆగ్రహం వ్యక్తం చేసారు.

రైతులకు లాభం జరిగేలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,బీజేపీ, టిఆర్ఎస్ లు ఆడుతున్న దొంగ నాటకాలు కట్టిపెట్టాలి. రైతులు నుంచి వచ్చే చివరి గింజ వరకు కొనుగోలు చేయాలి. రైతులకు అన్యాయం జరిగితే కాంగ్రెస్ రైతుల పక్షాన పోరాటం చేసి వారికీ అండగా ఉంటామని తెలిపారు.