పృథ్వీకి సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ డోంట్ రిపిట్….

పృథ్వీకి సీఎం జగన్ సీరియస్ వార్నింగ్ డోంట్ రిపిట్....

0
36

ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే… అమరావతిలో ధర్నాలు చేసేవారు రైతులు కాదని ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ పెయిడ్ ఆర్టిస్ట్ లని వ్యాఖ్యానించారు… ఇక దీనిపై నటుడు పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు…

అమరావతిలో రైతులు పోరాటం చేస్తుంటే పృథ్వీ పెయిడ్ ఆర్టిస్ట్ లని అనడం దారుణం అని అన్నారు… దానికి భేషరుతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.. అయితే తాను ఎవ్వరికి క్షమాపణ చెప్పనని పృథ్వీ చెప్పారు…

ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్ సీరియస్ అయినట్లు సమాచారం అందుతోంది… సమస్యలు మాట్లాడాలే తప్ప కులాల ప్రస్తావన సరికాదని స్పష్టం చేశారు… రైతులపై ఇష్టాను సారంగా మాట్లాడటం సరికాదని అన్నారు.. ఎవ్వరిని కించపరిచేలా మాట్లాడవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది….