రఫ్ఫాడించిన రోజా….

రఫ్ఫాడించిన రోజా....

0
34

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నగరి ఎమ్మెల్యే రోజా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు… తాజాగా అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మద్యపాన నిషేదంపై ర్చ జరిగింది… ఈ చర్చలో రోజా పలు కీలక వ్యాఖ్యలు చేశారు….

చంద్రబాబు నాయుడు విజన్ 2020 కాదని విజన్ 420 అని ఎద్దేవా చేశారు… గత ప్రభుత్వంలో మద్యం పాలసీలను తెచ్చి లక్షలాది కుటుంబాలను అన్యాయమయ్యాయని రోజా మండిపడ్డారు… వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత… టీడీపీ ప్రభుత్వంలో ఏర్పడిన 43 బెల్ట్ షాపులను తొలగించి 40 శాతం బార్లను కూడా తగ్గించారని అన్నారు…

జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలమేరకు మద్యపానాన్ని అరికడుతున్నారని అన్నారు… గ్రామ స్వరాజ్యం రావాలని అర్థరాత్రి ఆడపిల్ల స్వేచ్చగా తిరిగిన రోజునే స్వాతంత్రం వచ్చినట్లు అని గ్రామల్లో మధ్య పానం ఉండకూడదని మహాత్ముడి ఆశయాల సాధనకోసం జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు రోజా..