చిన జీయర్‌ పై రేవంత్‌ సంచలన వ్యాఖ్యలు..బ్రోకర్లను పట్టుకుని తిరుగుతున్నారంటూ..

Rewanth's sensational comments on Chinna Jiyar.

0
32

తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలు చేస్తే పేదలకు 25శాతం అడ్మిషన్లు ఫ్రీ వస్తుంది. యాక్ట్ గురించి అడిగితే కేజీ టు పీజీ ఇస్తున్నాం అని కేసీఆర్ అంటుండు. అసలు టీచర్ల నోటిఫికేషన్ ముఖ్యమంత్రి ఎందుకు ఇవ్వడం లేదు? టీచర్లే లేనప్పుడు ఇంగ్లీషు మీడియం ఎలా చదువును అందిస్తారు? సింగిల్ టీచర్ స్కూల్ తెచ్చి పాఠశాలను అన్నింటినీ మూసివేశారు. పేదలకు విద్యను దూరం చేసేందుకు కేసీఆర్ కంకణం కట్టుకున్నారని విమర్శలు గుప్పించారు.

రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ను తెలంగాణలో అమలు చేస్తే పేదలు బాగుపడుతారు. కేసీఆర్ రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే నియమాలను చేపట్టారు. రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ లెక్క లేదు. అందుకే మోడీ వీడియో కాన్ఫిరెన్సు కు హాజరు కాలేదు. పాఠశాలలో కరోనా వచ్చి మరణాల సంఖ్య ఒక్కటి కూడా లేదు- అయినా వాటిని మూసివేశారు. పబ్ ల వల్ల మరణాలు జరుగుతున్నాయి. అయినా వాటిని నియంత్రణ చేయరు. ఎందుకంటే ఆదాయం ఉంటుంది. కాబట్టి…ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పేదలకు విద్యను దూరం చేసాడు.

చదువును దూరం చేసి గొర్లు- బర్లు- చేపలు ఇస్తుండు. విద్యకు పెట్టె నిధులు కేసీఆర్ దృష్టిలో ఖర్చు- సమాజం దృష్టిలో పెట్టుబడి తెలంగాణకు ముందు ఉస్మానియా యూనివర్సిటీ ఉంది కాబట్టే జార్జ్ రెడ్డిలాంటి లీడర్లు పుట్టారు తెలంగాణ ఏర్పడిన తర్వాత యూనివర్సిటీలు నిర్వీర్యం అయ్యాయి. కేసీఆర్ మనువాది. ఉద్యోగుల భర్తీ లేకుండా- ఎన్ని చట్టాలు తెచ్చినా లాభం లేదు దళితబంధు మంచి పథకం- అమలు చేస్తే బాగుంటుంది.

టీఆర్ఎస్ యూపీలో SPకి మద్దతుగా ప్రచారం చేస్తే- MIM కి మిత్రద్రోహం చేస్తుండ కేసీఆర్? తెలంగాణలో MIM తో పొత్తు పెట్టుకొని యూపీలో MIM కి కాకుండా SPకి ప్రచారం చేస్తారా? కేటీఆర్ క్రిమినల్స్ తో చర్చలు జరపకపోవచ్చు- కానీ నేను 420, క్రిమినల్స్ తో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నా కేటీఆర్ చర్చలు జరపాలి అంటే సినిమా గ్లామర్ ఉండాలి- అది నా దగ్గర లేదు కదా ఆపరేషన్ ఆకర్ష్ కోసం పార్టీ లో కమిటీ వేశారు. అంటే ఆ పార్టీ పని ముగిసిందనే విషయంలో ఎలాంటి డౌట్ లేదు. బీజేపీ పక్క పార్టీల నుంచి తీసుకున్న నేతలతో కమిటీలు వేసుకున్నారు.

ఆ కమిటీలు చూస్తేనే అర్థం అవుతుంది. బీజేపీ దివాళ తీసిందని రాష్ట్రంలో డీజీపీ ఉన్నాడా? అని నా డౌట్. మేము శైవులం కాబట్టే- వైష్ణవులు మమ్ములను అవమానిస్తున్నారా? సమానత్వం అని టైటిల్ పెట్టి- ఒక ఎంపీని- పార్టీ అధ్యక్షుడుగా ఉన్న నాకు రియలేస్టేట్ ఉద్యోగితో నాకు ఆహ్వానం పలుకుతారా?చిన్నజీయర్ స్వామీజీ ఆశ్రమం నుంచి మాకు ఆహ్వానం ఎందుకు రాలేదు? రియలేస్టేట్ వ్యవస్థ కోసం చెట్లను నరికి రోడ్లు వేస్తున్నారు. చిన్నజీయర్ స్వామీజీ పై మాకు అపారమైన గౌరవం ఉంది.

కానీ రియలేస్టేట్ బ్రోకర్ ను పక్కనపెట్టుకొని తిరిగితే మాకు అనుమానాలు వస్తాయి. చిన్నజీయర్ స్వామి ల్యాండ్ గ్రాబర్ పక్కట పెట్టుకోని వ్యవస్థను, ఒక కంపెనీ కోసం దుర్వినియోగం చేస్తున్నారు. మోడీ ఏం భక్తుడొ ఆయనకే తెలియాలి. చైనా విగ్రహ ఆవిష్కరణ కోసం వెళ్లడం ఏంటో! స్వామీజీ అంత గొప్ప కార్యక్రమం- ఒక రియలేస్టేట్ సంస్థ కోసం చేస్తున్నారా? దేవుని ముందు అందరూ సమానమే అన్న స్వామీజీ ముందు మాత్రం సమానత కనిపించడం లేదు. ప్రధాని- రాష్ట్రపతి పర్యటన అడ్డం పెట్టుకోని- రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఆస్తులను పెంచడానికి ప్రభుత్వం పని చేస్తోంది. చిన్నజీయర్ స్వామి దగ్గర రియలేస్టేట్ వ్యక్తులు ఉంటే ఆయన గౌరవానికి కరెక్ట్ కాదు. రియలేస్టేట్ సంస్థ కోసం చెట్లను నరకడం పై బీజేపీ కూడా సమాధానము చెప్పాలి. స్వామీజీని నేను కలిసి ఏమైనా చెప్పాలి అంటే ఆయన చుట్టూ రియలేస్టేట్ వ్యక్తులే ఉంటారని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు.