సీమలో టీడీపీకి మరో జోష్ లాంటి వార్త

సీమలో టీడీపీకి మరో జోష్ లాంటి వార్త )

0
29

తెలుగుదేశం పార్టీ సీమలో పెద్ద ఇప్పుడు రాజకీయంగా ఊహించినంత స్ధాయిలో లేదు, కేవలం తెలుగుదేశం పార్టీ రెండు మూడు చోట్ల మినహ అంతా వైసీపీ వేవ్స్ కనిపిస్తున్నాయి. అయితే సీమ నేతలకు పెద్ద పదవులు ఇవ్వకపోవడం కూడా టీడీపీ పై విమర్శలకు కారణం అవుతోంది. అందుకే టీడీపీ ఈ ఎన్నికల్లో ఇంత దారుణమైన ఓటమి చవిచూసింది అంటున్నారు.

అందుకే సీమపై స్పెషల్ ఫోకస్ పెట్టారట బాబు.. అందుకే జిల్లాల్లో పర్యటనలు బిజీ టూర్లు పెడుతున్నారు.. అంతేకాదు వచ్చే రోజుల్లో సీమ నేతలకు యువ నాయకులకు కీలక పదవులు ఇచ్చేందుకు సిద్దం అవుతున్నారు.. ముఖ్యంగా సీమ ప్రాంతం డవలప్ మెంట్ తామే చేశాము అని చెప్పే విధంగా తెలుగుదేశం సిద్దం అవుతోంది.

ముఖ్యంగా జగన్ తాము చేసిన పనులు మాత్రమే చేస్తూ, కొత్త కలరింగ్ వేస్తున్నారు అని ఆరోపణలు చేస్తోంది ..వచ్చే రెండు మూడు నెలల్లో స్ధానిక సంస్ధల ఎన్నికలే ప్రధాన అజెండాగా ముందుకు వెళతాం అంటున్నారు టీడీపీ నేతలు. అందుకే సీమలో సైకిల్ పార్టీకి కొత్త ఆశలు పుట్టిస్తున్నారు.