నటి రోజా ఫ్యాన్స్ కు షాక్..

0
31

రోజా 100 కి పైగా సినిమాలలో నటించి మనందరినీ ఆకట్టుకుంది. ఎన్నో ఏళ్ల నుంచి జబర్దస్త్ జడ్జ్ గా వ్యవరించి అందరిని నవ్వించేది. కానీ ప్రస్తుతం రోజా షాకింగ్ నిర్ణయం తీసుకొని..రోజా ఫాన్స్ కు నిరాశ మిగిల్చింది. జగన్ ప్రభుత్వ కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి రావడంతో సినిమాలు , షూటింగ్ లు మానేస్తున్నట్లు రోజా తెలిపారు.

సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు మరచిపోనని..మంత్రి పదవికి న్యాయం చేస్తా అని రోజా ప్రకటించారు.తనను అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వనని చంద్రబాబు అన్నారనీ, కానీ జగన్ తనను రెండుసార్లు ఎమ్మెల్యే గా గెలిపించి ఇప్పుడు మంత్రిని చేశారని ఆనందం వ్యక్తం చేసింది. మహిళా పక్షపాత సీఎం కేబినెట్ లో మంత్రిగా చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు ఆమె చెప్పారు.