వారు రాకతో టీడీపీ కంచుకోట వైసీపీ కంచుకోటగా మారనుందా

వారు రాకతో టీడీపీ కంచుకోట వైసీపీ కంచుకోటగా మారనుందా

0
32

విశాపట్టణం జిల్లా ఎప్పటినుంచో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది… అయితే ఇక నుంచి టీడీపీ కంచుకోట బద్దలై రానున్న రోజుల్లో వైసీపీ కంచుకోటగా మారుతుందని ఇటీవలే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కొందరు నేతలు అంటున్నారు. ముఖ్యంగా భీమిలీ నియోజకవర్గంలో నుంచి టీడీపీకి బీటలు వాలుతున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ది చూసి టీడీపీ నాయకులు వైసీపీలో చేరుతున్నారు.. తాజాగా టీడీపీకి కీలకంగా వ్యవహరించిన టీడీపీ నాయకులు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చరారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటివరకు భీమిలీ నియోజకవర్గం టీడీపీ కంచుకోట అని పిలవబడిందని ఇక నుంచి వైసీపీ కంచుకోట అని పిలువబడుతుందని స్పష్టం చేశారు…