జనసేన బాటలోనే టీడీపీ..బద్వేల్ లో అసలేం జరుగుతుందంటే?

0
42

ఏపీ: బద్వేల్ బైపోల్ కు టీడీపీ దూరంగా ఉండనుంది. ఈరోజు జరిగిన పార్టీ పొలిటిబ్యూరో సమావేశంలో టీడీపి అధినేత చంద్రబాబు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మృతితో ఉప ఎన్నిక రాగా..ఆయన సతీమణికే వైసీపీ టికెట్ ఇచ్చినందుకు టీడీపీ విముఖత చూపింది.

ఇదిలా ఉండగా జనసేన కూడా ఇప్పటికే పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించగా..బీజేపీ మాత్రం పోటీ చేస్తామని చెబుతుంది. చూడాలి మరి రానున్న రోజుల్లో బీజేపీ పోటీ నుండి తప్పుకుంటుందో లేక బద్వేల్ బరిలో ఉంటుందో చూడాలి.