సాక్ష్యాధారాలతో రెడీ అంటున్న టీడీపీ… వైసీపీ సై అంటుందా…

సాక్ష్యాధారాలతో రెడీ అంటున్న టీడీపీ... వైసీపీ సై అంటుందా...

0
50

ఏపీ అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఛీప్ కళా వెకంట్రావు సంచనల వ్యాఖ్యలు చేశారు… ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం సూట్ కేసు కంపెనీ కుంభకోణంగా మార్చాని మండిపడ్డారు… వైసీపీ నేతలు ఇళ్లపట్టాలపేరిట వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు…

తాజాగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దూర్మారంగా సేకరించిన భూముల స్వీకరణకు ప్రజలు సిద్దంగా లేరని మండిపడ్డారు… రాష్ట్రంలో జరుగుతున్న భూ అక్రమాలపై సాక్ష్యాధారాలతో సహా లెక్కలు చెప్పేందుకు తాము సిద్దంగా ఉన్నామని కళా వెంకట్రావు అన్నారు…

ఈమేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాశారు… భూ కుంభకోణంపై రిటైర్డ్ లేదంటే సిట్టింగ్ జడ్జీతో కమిటీ ఏర్పాటు చేయాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు… వైసీపీ సర్కార్ ఇంతవరకు ఒక్క ఇంటిని కూడా నిర్మించలేకపోయిందని ఆయన మండిపడ్డారు..