సభ నుంచి టీడీపీ వాకౌట్

సభ నుంచి టీడీపీ వాకౌట్

0
37
AP Assembly

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి… ఈ సమావేశంలో ప్రతిపక్షాలపై అధికార నాయకులు అధికార నాయకులపై ప్రతిపక్ష నేతలు విమర్శలు చేసుకుంటున్నారు… ఈరోజు హౌసింగ్ పై చర్చ జరిగింది…

గత ప్రభుత్వ హయాంలోని ఇళ్ల నిర్మాణం పై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అడిగిన ప్రశ్నకు పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమాధానం చెప్పారు… గత ప్రభుత్వంలో ఇళ్లను అదరాబదర కట్టించిదని అన్నారు…

ఈ క్రమంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ ఆయన చెప్పింది… తమకు ఏమీ అర్థం కాలేదని తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ నేతలు స్పీకర్ ను కోరారు… సభాపతి అవకాశం ఇవ్వకుండా వేరే ప్రశ్నకు వెళ్లడంతో అందుకు నిరసిస్తూ టీడీపీ నేతలు సభనుంచి వాకౌట్ చేశారు…