ఏపీ ప్రభుత్వం శుభవార్త..మూడు నెలల్లో ఉపాధిహామీ పనులు పూర్తి

0
39

జగన్ సర్కార్ వరుస శుభవార్తలతో ప్రజలకు ఆనందపరుస్తున్నారు. జగన్ సీఎం అయిన్నప్పటి నుండి తన మార్క్ చుపెట్టుకుంటున్నాడు. అంతేకాకుండా వినూత్నమైన మార్పులు చేస్తూ ఏపీని అభివృద్ధి చేస్తున్నాడు. ప్రస్తుతం ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఏప్రిల్, మే, జూన్‌ నెలల్లో ఉపాధిహామీ పనులను తొందరగా పూర్తి చేస్తామని ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన చేసాడు. ఈ మూడు నెలల్లో కలెక్టర్లు దృష్టి సారించి పనులు శరవేగంగాపూర్తి చేయాలనీ ఆదేశాలు జారీ చేసారు. కనీసం 60 శాతం పనులను పూర్తి చేయాలనీ అధికారులను డిమాండ్ చేసారు.

అంతేకాకుండా అంతకు ముందు నెలలో అమలైన పథకానికి సంబంధించి మిగిలిపోయిన అర్హులు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. డిసెంబర్‌ నాటికి 4,545 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణం పూర్తి కావాలని ఆయన పేర్కొన్నారు.