టీడీపీలో బాబుకి మరో 30 మంది షాక్

టీడీపీలో బాబుకి మరో 30 మంది షాక్

0
39

తెలుగుదేశం పార్టీ మొత్తానికి మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తోంది.. అయితే చంద్రబాబు గతంలో ఇదే మండలి అక్కర్లేదు అని అన్నారు, అది గతం తర్వాత మండలిని అన్ని పార్టీలు స్వాగతించాయి కదా అనేది తెలుగుదేశం చెప్పేమాట, అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కావాలనే మండలిలో తన మెజార్టీ ఉండటంతో ఈ బిల్లులు ఆపాలి అని చూస్తున్నారు.

అందుకే ఇక వైసీపీ ఫైనల్ గా శాసనమండలి రద్దు చేయాలి అని భావించింది అని తెలుస్తోంది. అయితే వైసీపీకి ఎలా ఉన్నా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్సీలు చాలా డైలమాలో ఉన్నారు, అసలు తమకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయినా ఓటమిపాలైనా ఇలా ఎమ్మెల్సీలుగా రాజకీయ ఉద్యోగాలు చేసిన ఈ నేతలు ఇప్పుడు పదవులు లేకపోవడంతో ఖాళీ అవ్వాల్సిందే.

అయితే చంద్రబాబు రాజకీయంగా ఇలాంటి ఆలోచన చేసి తమ రాజకీయాలపై దెబ్బ కొట్టారు అని సుమారు 30 మంది వరకూ నేతలు ఫీలవుతున్నారట, బాబు ఏదో సాధించాడు అని గర్వంగా చెప్పడం దేనికని ఉన్నా పదవులు పోగోట్టాడు అని బాధపడుతున్నారట.