ప్రధాని మోదీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఇదే..

0
48

ప్రస్తుతం కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడం కోసం పావులు కదుపుతుంది. ఈ మేరకు హైదరాబాద్ లో ప్రధాని మోడీతో జులై 2న భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో బీజేపీ అగ్రనేతలు పాల్గొననున్నారు. తాజాగా మోడీ పర్యటన షెడ్యూల్ ఇలా ఉండనుంది.

జులై 1న మధ్యాహ్నం 3 గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకుంటారు.

ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయం వద్ద భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శంషాబాద్‌లో కిలోమీటరు దూరం నిర్వహించే రోడ్‌షోలో నడ్డా పాల్గొంటారు.

జులై 2న మోదీ హైదరాబాద్‌ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తారు. రాజ్‌భవన్‌ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్‌ హోటల్‌కు చేరుకుంటారు.

జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్‌భవన్‌లో బస చేస్తారు.

తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్తారు.