ట్విట్టర్ లో టీడీపీని దుమ్ముదులిపిన విజయసాయిరెడ్డి…

ట్విట్టర్ లో టీడీపీని దుమ్ముదులిపిన విజయసాయిరెడ్డి...

0
34

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు…. ఎక్కడ గ్యాంగ్ వార్ జరిగినా రక్తపాతం సృష్టించేది చంద్రబాబు నాయుడు అనుంగు శిష్యులే మండిపడ్డారు.. అలాగే జగన్ పైనే హత్యాయత్నం చేయించిన చరిత్ర…. 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసేమిటని వెనకేసుకొచ్చాడు. రికార్డులు తీస్తే ఆయన హయాంలోనే ఆమె పైన 13 FIR లు నమోదయ్యాయని తేలిందని గుర్తు చేశారు…

అలాగే ఆయన కుమారుడుపై కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు సాయిరెడ్డి లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోందని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ఆవేదన తాలూకు ఉద్రేకం బయటపడినట్టు అనిపిస్తోంది. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం.

హైదరాబాద్ లో ఉన్నా కూడా చంద్రబాబు మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోంది. మోదీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడు. బీజేపీ కి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించారు. ఎల్లో మీడియా ఎంటరై అదొక చారిత్రక అవసరమన్నట్టు వరస కథనాలు వడ్డిస్తుందని ఆరోపించారు…