వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న వంశీ

వైసీపీలో చేరేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న వంశీ

0
38

ఏపీ ప్రధాన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభ నేని వంశీ పార్టీ సభ్యత్వానికి అలాగే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే… ఆయన నేడు లేన వచ్చే నెల 3వ తేదిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం తీసుకోవాలని డేట్ ఫిక్స్ చేసుకున్నారని సమాచారం..

ఇక మరోవైపు ఆయన్ను పార్టీనుంచి నిలువరించేందుకు చంద్రబాబు నాయుడు తమ్ముళ్లు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆయన మాత్రం అంగీకరించడంలేదు… కాగా 2006లో రాజకీయ అరంగేట్రం చేసిన వల్లభనేని వంశీ అప్పటినుంచి ఇప్పటివరకూ టీడీపీలోనే ఉన్నారు…

అందుకే ఆయన్ను టీడీపీ వదులుకోవడానికి ఇష్టపడటంలేదు… వంశీకి టీడీపీకి విడతీయలేదని అనుబంధం ఉంది అలాంటినేత ఇప్పుడు వైసీపీలోకి చేరితే ఆ పార్టీకి దెబ్బే అని అంటున్నారు రాజకీయ మేదావులు…