వంశీ చేరికపై క్లారిటీ ఇచ్చిన యార్లగడ్డ

వంశీ చేరికపై క్లారిటీ ఇచ్చిన యార్లగడ్డ

0
39

ఇటీవల టీడీపీ గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఆయన వ్యవహారం కొద్దికాలంగా చర్చనీశంగా మారింది… రాజీనామా చేసిన తర్వాత తాను వైసీపీతో కలిసి పని చేస్తానని చెప్పారు వంశీ…

దీంతో గన్నవరం వైసీపీ ఇంచార్జ్ యార్లగడ్డ వెంకట్రావు రాజకీయం ఏంటనేది ప్రశ్నార్థంగా మారింది…. అలాగే తమ నాయకుడు రాజకీయం పట్ల కార్యకర్తల్లో కూడా ఆందోళన నెలకొంది… ఈ క్రమంలో యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…

తాను వంశీ గురించి ఇప్పుడు స్పందించనని అన్నారు… ఆయన పార్టీలో చేరిన తర్వాత మాట్లాడుతానని అన్నారు… తాను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విధేయుడనని అన్నారు.,.. తాను గతంలో ఎవరిపైన ఎలాంటి కేసులు పెట్టలేదని అన్నారు… ఇంతవరకు తాను వంశీని కలవలేదని గన్నవరం అభివృద్దికోసం కలిసి పనిచేస్తానని చెప్పిన మటలను మీడియాలో చూశానని అన్నారు యార్లగడ్డ…