జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ….

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ....

0
39

ప్రస్తుతం ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటు కేంద్ర బింధువుగా మారుతున్నారు… తాజాగా టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..

పుసుపూ కుంకుమ ద్వారా మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని అనుకున్నామని చెప్పారు… కానీ టీడీపీకి ప్రజలు దిండూ దుప్పటి ఇచ్చారని వంశీ ఎద్దేవా చేశారు… ఈ ఎన్నికల్లో గెలవకపోయే పాటికి పార్టీలో ఇన్ సెక్యూరిటీ అపద్రతాభావం వచ్చిందని వంశీ తెలిపారు,..

ఇటీవలే ప్రజల్లో తిరెగేటప్పుడు చాలామంది జూనియన్ ఎన్టీఆర్ వస్తారా…. ఒక వేళ వస్తే ఆయన ఏదైనా చేస్తారా అతని వల్ల ఏమైనా అవుతుందా అని అడిగారని తెలిపారు… అయితే ఇదంతా హైపోథెటికల్ అని ఎన్టీఆర్ రాకపోవచ్చుకూడా అని అన్నారు వంశీ… ఆయన వస్తే రిజల్ట్ ఉంటుందో ఉండదో కూడా చెప్పలేమని అన్నారు… గతంలో చిరంజీవి ఇప్పుడు పవన్ రాజకీయాల్లోకి వచ్చినా ఎఫెక్ట్ లేదని అన్నారు.. ఒకవేల ఎన్టీఆర్ వచ్చినా ఎఫెక్ట్ ఉండవచ్చు ఉండక పోవచ్చని అన్నారు వంశీ.