వరుస ట్వీట్లతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్న విజయసాయిరెడ్డి

వరుస ట్వీట్లతో చంద్రబాబుకు ముచ్చెమటలు పట్టిస్తున్న విజయసాయిరెడ్డి

0
32

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడుపై వరుస ట్వీట్లు చేశారు.. చంద్రబాబు నాయుడు కళ్లల్లో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుందని ఆరోపించారు… పదవిలో ఉన్నన్నాళ్లు చంద్రబాబు ఏ సంతకం చేసినా, జివో ఇచ్చినా, పర్యటన చేసినా ప్రతిదీ కమిషన్లు, వాటాల కోసమేనని ఆరోపించారు ఎల్లో మీడియా డప్పు కొడుతూ బొక్కలు బయట పడకుండా చూసేదని మండిపడ్డారు దోపిడీ వ్యవహారాలు ఇప్పుడు సాక్ష్యాధారాలతో వెలుగుచూస్తుంటే కులం, కక్ష అంటూ బట్టలు చించుకుంటున్నారని ఆరోపించారు.

అమరావతికి సంబంధం లేని మహిళలతో దాడులు చేయించడం, దుష్ప్రచారాలు సాగించడమా 40 ఏళ్ల అనుభవం అంటే? ప్రజలు అధికార పీఠం నుంచి విసిరి కొట్టినప్పటి నుంచి ఏదో ఒక విధ్వంసానికి కుట్ర పన్నడం తప్ప రాష్ట్రానికి మేలు చేసే పని ఒక్కటైనా చేశావా? ప్రతిపక్ష నేతవని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి అని అన్నారు

బాబు కళ్లలో ఆనందం కోసం పచ్చ మీడియా ఏదైనా రాస్తుంది. ఎంగిలి కూడు తిన్న విశ్వాసం కదా! యజమాని, బానిసలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మరో ఏడాదిలో ఇక్కడ అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనులను అన్ని రాష్ట్రాలూ అనుసరిస్తాయి. సిఎం జగన్ పాలనలో ఏపీ రోల్ మోడల్ అవుతుందని తెలిపారు విజయసాయిరెడ్డి