వంగవీటి రాధాను చంపాలనుకున్నది ఎవరు?

Who wanted to kill Vangaveeti Radha?

0
39

ఏపీ: టీడీపీ నేత వంగవీటి రాధా కృష్ణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. తనను చంపడానికి రెక్కీ నిర్వహించారని రాధా అన్నారు. తనని ఏదో చేద్దామనుకుని రెక్కీ నిర్వహించారని రాధా చెప్పారు. వంగవీటి రాధా  చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే వంగవీటి రాధాను చంపాలనుకుంది ఎవరు? ఆ అవసరం ఎవరికుంది.

ఈ నేపథ్యంలో అరవ సత్యం పేరు తెరపైకి వచ్చింది. వైసిపి నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడే అరవ సత్యం. అయితే ఈ ప్రచారాన్ని అరవ సత్యం కుమారుడు ఖండించాడు. పోలీసుల అదుపులో తన తండ్రి లేడని ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.

అయితే వంగవీటి రాధాకు ఏపీ ప్రభుత్వం గన్ మెన్ ను నియమించింది. మరోవైపు వంగవీటి రాధాను టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ లో పరామర్శించారు. రెక్కీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. త్వరలో విజయవాడకు వచ్చి అన్ని విషయాలు తెలుసుకుంటానని చెప్పారు. భద్రతను ఎందుకు తిరస్కరించావని ప్రశ్నించారు. జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు సూచించారు. దీనిపై ఏపీ డీజీపీకి చంద్రబాబు ఫిర్యాదు చేశారు.