సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు బాబు దగ్గరకే ఇదిగో సాక్ష్యం

సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు బాబు దగ్గరకే ఇదిగో సాక్ష్యం

0
35

రాజకీయాల్లో కొన్ని సంఘటనలు ఎవరూ ఊహించలేరు.. ముఖ్యంగా ప్రజలే ఇక్కడ ఫైనల్ , నాయకుల చేతిలో ఏమీ ఉండదు ఆచితూచి మాట మాట్లాడాలి అడుగు వేయాలి …ఒకసారిరాంగ్ స్టెప్ వేస్తే ఇక పొలిటికల్ గా ఫ్యూచర్ ఏమీ ఉండదు.. రాజకీయంగా దేశంలో వందల మంది నాయకులకు అనుభవంలో జరిగిందే ఇది…చిన్న తప్పు వల్లే ఆ పదవి పోగొట్టుకున్నారు రాజకీయ మనుగడ లేకుండా చేసుకున్న వారు ఎందరో ఉన్నారు.. అయితే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలైంది, వైసీపీ విజయం సాధించి జగన్ గెలుపొందారు.

అయితే ఇప్పుడు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ పార్టీ నేతలు ఎమ్మెల్యేలు చాలా మంది వైసీపీకి గుడ్ బై చెప్పాలి అని అనుకుంటున్నారట. అంతేకాదు అందరూ క్యూ కట్టుకుని బాబు దగ్గరకు రావాలి అని చూస్తున్నారట. తెలుగుదేశం పార్టీ నేత, ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య తాజా వ్యాఖ్యలు, వైసీపీకే కాదు అందరికి షాక్ కి గురిచేశాయి.

వేమూరి ఆనంద సూర్య సంచలన వ్యాఖ్యలు చేశారు. సగం మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని. సీఎం జగన్ తీరుతో వైసీపీ ఎమ్మెల్యేలు సైతం విసిగిపోయారని, త్వరలో అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరతారని కూడా ఆయన కామెంట్ చేశారు.అయితే దీనిపై వైసీపీ నేతలు కౌంటర్ వేస్తున్నారు ..ముందు ఎమ్మెల్సీలని కాపాడుకోవాలి అని అలాగే ఉన్నా ఎమ్మెల్యేలు ఇద్దరు పార్టీకి గుడ్ బై చెప్పారు అది చూసకోవాలి అని సటైర్ వేస్తున్నారు.