వైసీపీ ఎంపీ బీజేపీలో చేరుతున్నారంటూ….

వైసీపీ ఎంపీ బీజేపీలో చేరుతున్నారంటూ....

0
36

అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ కొద్దికాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే… ఒక య్యూట్యూబ్ ఛానల్ యాజమాన్యం వైసీపీ ఎంపీ బాలశౌరి బీజేపీలో చేరుతున్నారంటూ పదే పదే ప్రచారం చేసింది…

ఇక ఈ వార్తలపై ఎంపీ సీరియస్ అయ్యారు… తాజాగా ఆయన ఏపీ సీఐడీ పోలీసులుకు ఫిర్యాదు చేశారు… ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు య్యూట్యూబ్ ఛానల్ పై కేసు నమోదు చేశారు…

ఈ కేసులు భాగంగా య్యూట్యూబ్ ఛానల్ యాంకర్ ను ఇప్పటికే ప్రశ్నించినట్లు సీఐడీ పోలీసులు తెలిపారు… అలాగే ఆ ఛానల్ యాజమాన్యానికి నోటీసులు పంపామని తెలిపారు…