వైసీపీ నేతలు అందరూ ఆ హీరో గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే

వైసీపీ నేతలు అందరూ ఆ హీరో గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటే

0
34

వైసీపీలో ఓ వర్గం చాలా తీవ్రంగా చర్చించుకుంటున్నారట ఓ విషయం.. ఇంతకీ ఏమిటి అంటే ఆ విషయం… ఇటీవల సీఎం జగన్ మూడు రాజధానుల ప్రకటన చేశారు.. అయితే రాజధాని రైతులు దీనిపై తీవ్రస్ధాయిలో విమర్శలు ఆరోపణలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ సమయంలో ఓ వార్త మాత్రం బాగా వైరల్ అవుతోంది. రాజధాని ప్రాంతంలో తక్కువ రేటుకి ఓ అగ్రహీరో సుమారు 500 ఎకరాలు కొనుగోలు చేశారు అని వార్త వినిపిస్తోంది.

అయితే టీడీపీకి బాగా దగ్గరగా ఉండే హీరో అని ఓ వార్త వినిపిస్తున్నవేళ, ఇంత పెద్ద మొత్తంలో ఆ హీరో ఎక్కడ కొన్నాడు అనేది వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు.. అయితే ఆ హీరో ఎవరు అనేది మాత్రం తెలియడం లేదు… ఒక్కో సెగ్మెంట్లో 30 ఎకరాల చొప్పిన పది రోజుల్లో కొనేశాడు అని వార్తలు వస్తున్నాయి.. ఇప్పుడు రాజధాని విశాఖకు మారుతోంది అని తెలియడంతో..

కోట్ల రూపాయలు అవుతుంది అనుకున్న ఎకరాల వాల్యూ కేవలం లక్షల్లోకి పడిపోయింది అని బాధపడుతున్నాడట సదరు హీరో..
ఇంతకీ ఆ హీరో ఎవరు ఏంటి అనే విషయాలు మాత్రం బయటకు రావడం లేదు. కాని దారుణంగా నష్టపోయాడు అని కొందరు అంటున్నారు ఇంతకీ ఈ హీరో ఎవరు అని తీవ్రంగా చర్చించుకుంటున్నారు అందరూ.