వైసీపీకి షాక్…. ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపిన చంద్రబాబు

వైసీపీకి షాక్.... ప్రత్యేక టీమ్ ను రంగంలోకి దింపిన చంద్రబాబు

0
32

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఫాలో అవుతున్నారా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు… 2024 ఎన్నికల్లో విజయం సాధించాలనే ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు రంగంలోకి కొత్త టీమ్ దించారని వార్తలు వస్తున్నాయి…

రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గత ఎన్నికల్లో ఘోర పరాభావం ఎదుక్కున్నారు.. వచ్చె ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో వైసీపీ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ టిమ్ తో డీల్ కుదుర్చుకుని రంగంలోకి దింపారని వార్తలు వస్తున్నాయి.. గత ఎన్నికల ముందు వైసీపీ తమ పార్టీ వ్యుహకర్తగా ప్రశాంత్ కిశోర్ ను అధికారికంగా రంగంలోకి దింపింది…

ఇక ఈ వ్యవహారంపై టీడీపీ అప్పట్లో విమర్శలు చేసింది.. కానీ ఎన్నికలు ముగిసి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి ఘోరపరాజయాన్ని మూటకట్టి ఇచ్చింది కిశోర్ టీమ్… ఇక దీన్ని గమనించిన చంద్రబాబు ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు ఉండగానే ప్రశాంత్ కిశోర్ తోనే అదినేత చంద్రబాబు నాయుడు డీల్ కుదుర్చుకుని రంగంలోకి దించారనివార్తలు వస్తున్నాయి