బాబు నివాసం తర్వాత నెక్ట్స్ జగన్ టార్గెట్ ఆ నేతపైనే

బాబు నివాసం తర్వాత నెక్ట్స్ జగన్ టార్గెట్ ఆ నేతపైనే

0
40

ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి సమీపంలో కృష్ణా నది కరకట్టపై ఉన్న నివాసం అక్రమ నిర్మాణం అని సీఆర్డీఎ అధికాలు గతంలో తేల్చి చెప్పారు… ఆ మేరకు నోటీసులు కూడా జారీ చేశారు

తాజాగా మరోసారి నోటీసులు జారీ చేశారు చంద్రబాబుకు వారం రోజులు టైం ఇస్తున్నామని ఈ వారం రోజుల్లో ఖాళీ చేయకపోతే ఇళ్లు కూల్చేస్తామని హెచ్చరించిన అధికారులు దాని పనిలో ఉన్నారు…. చంద్రబాబు తరువాత నెక్ట్స్ వైసీపీ సర్కార్ ఎవరిని టార్టెట్ చేసింది… అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న…

అయితే ఇదేక్రమంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నోటినుంచి ఇందుకు సమాధానం వచ్చేసింది…. ఇవాళ దేవినేని ఉమా కూర్చొని మాట్లాడుతున్న స్థలం ఇరిగేష్ శాఖకు సంబంధించినదని అన్నారు.. ఈ సైటును కేవలం 1000 రూపాయలు చెప్పున లీజుకుతీసుకుని ప్రజాధనాన్ని దోపిడి చేశారని ఆయన మండిపడ్డారు…

ఉమాకు దమ్ముంటే ఆ స్తలాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు..ఉమా మాట్లాడే స్థలం అది పార్టీ కార్యాలయం అయితే దీన్ని కూడా త్వరలో కూల్చివేస్తారనే నుమానాలు వ్యక్తం అవుతున్నాయి.