బీజేపీకి అడ్డుకట్టవేసేందుకు చంద్రబాబుకు అంతు చిక్కని రీతిలో జగన్ భారీ ప్లాన్

బీజేపీకి అడ్డుకట్టవేసేందుకు చంద్రబాబుకు అంతు చిక్కని రీతిలో జగన్ భారీ ప్లాన్

0
35

ప్రస్తుతం ప్రతిపక్ష టీడీపీని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోకుండా కేవలం బీజేపీపైనే ఫోకస్ చేస్తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎలాగైన 2024లో పట్టు సాధించుకోవాలని చూస్తు బీజేపీకి జగన్ అడ్డుకట్టవేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు…

తాజాగా తమకు ఉత్తరాంధ్రలో అంత గ్రిప్ ఉండదని గ్రహించిన బీజేపీ రాయలసీమపై కన్నేసింది… ఈ ప్రాంతంలో పాగవేయాలనే ఉద్దేశంతో వెనుకబాటు తనాన్ని, హైకోర్టు, తాజాగా తిరుమలలో అన్యమత ప్రచారం కూడా చేస్తోంది… అయితే వీటి విషయంలో జగన్ వ్యూహాత్మకంగా ప్రవర్తిస్తున్నారు…

ఇటీవలే తనకు నమ్మిన బంటు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా చెప్పారు… కర్నూల్ జిల్లాలో హైకోర్టు ఏర్పాటు చేసే అంశం తమ పరిశీలనలో ఉందని అన్నారు…

అలాగే సీమకు కావీల్సిన దేహార్తిని కూడా తీర్చేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే ఇటీవలే కేసీఆర్ తో జగన్ భేటీ అయ్యారట. గోదావరి నీటిని శ్రీశైలంకు తరలించి రాయసీమను పచ్చ వణంగా మార్చాలని చూస్తున్నారు…