ప్రియాంక రెడ్డి పోస్టుమార్టం చూస్తే కన్నీరే

ప్రియాంక రెడ్డి పోస్టుమార్టం చూస్తే కన్నీరే

0
33

దారుణం అమానుషం అత్యంత పాశవిక చర్య, ప్రియాంక రెడ్డిపై జరిగిన అమానుషం అందరిని కలిచివేసింది, సాయం చేస్తామన్న చేతులే నరకానికి పంపాయి..కసాయి మూక గొంతు నులిమి చంపింది ..నలుగురు కామాందుల వాంచకు బలైంది ప్రియాంకరెడ్డి. ఆమెని అత్యంత దారుణంగా ఐదు గంటల పాటు వేధించి చంపేశారు..

ఆమెని అత్యంత పాశవికంగా చంపారు అనేది పోస్టుమార్టమ్ నివేధిక చూస్తే తెలుస్తుంది, నలుగురు దుర్మార్గులు ఆమెని అనుభవించి అమానుష చర్యకు పాల్పడ్డారు, పోస్టుమార్టమ్ నివేదిక చూసిన పోలీసులు కూడా కంగుతిన్నారు.. మరో నిర్భయ తరహ ఘటనగా అందరూ దీనిని ఖండిస్తున్నారు.. ఇంతకీ పోస్టుమార్టమ్ లో ఏముంది అంటే, ఆమెని నలుగురు అనుభవించారు. ఆ సమయంలో వారు మద్యం సేవించి ఉన్నారు. అంతేకాదు ఆ నలుగురు ప్రియాంక రెడ్డి పై గ్యాంగ్ రేప్ కు పాల్పడి, కొద్ది సేపు తర్వాత ఆమెకు ఊపిరి ఆడకుండా చేసి చంపేశారట.

తర్వాత మృతదేహాన్ని దుప్పట్లో చుట్టారని, ఆపై కిరోసిన్ పోసి నిప్పంటించారని రిపోర్టు చెబుతోంది, ఎవరైనా అటు వస్తారు అని భావించి, అక్కడ నుంచి శవం కాలకుండానే వదిలి వెళ్లిపోయారు.. అందుకే 70 శాతానికి పైగా ఆమె శరీరం కాలిపోయింది అని తేల్చారు. ఇందులో నలుగురు నిందితులు దొరికారు వారిలో ముగ్గురు 25 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తులు.