Flash: షాక్..మరోసారి పెరిగిన ధరలు..

0
44

ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెంచడంతో ప్రజలు నానాతిప్పలు పడుతున్నారు. ఈ క్రమంలో ఆయిల్ కంపెనీలు సామాన్యులపై అదనపు భారం వేసేందుకు సిద్ధమయ్యాయి. తాజాగా గ్యాస్ సిలిండర్ ధరను మరోసారి పెంచి ప్రజలను కోలుకొని షాక్ కు గురిచేసారు.

కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 104 రూపాయలకు పెంచడంతో హైదరాబాద్ లో కమర్షియల్ సిలిండర్ ధర 2563 రూపాయలకు చేరి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఇక ఎల్పిజి సిలిండర్ ధర విషయానికొస్తే ఎలాంటి మార్పు చేయకపోవడం అంటే ప్రజలు కాస్త ఆనందపడవల్సిన విషయమేనని చెప్పుకోవచ్చు. దీంతో పెరిగిన సిలిండర్ ధరతో వంట చేసుకోవాలంటేనే జంక వలసిన ప్రరిస్థితి ఏర్పడింది.