Flash: విద్యార్థులు బీ అలెర్ట్..రేపటి నుంచే టెన్త్ సప్లమెంటరీ పరీక్షలు

0
44

తెలంగాణలో 2021–22 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్ టికెట్స్ కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 1 వ తేదీ అనగా రేపటి నుంచి 10వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రభుత్వ పరీక్షల సహాయ సంచారకుడు రామేశ్వర రావు తెలిపారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు ఈ పరీక్షలు జరగనున్నట్టు తెలిపారు.

ముఖ్య గమనిక: విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.