స్వామి వివేకానందా జీవిత చరిత్ర

స్వామి వివేకానందా జీవిత చరిత్ర

0
67

భారతీయతను భారతదేశ ఔన్నత్వాన్ని తత్త్వచింతనను దేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు స్వామి వివేకానందుడి.. జనవరి 12, 1863 సంవత్సరంలో కోల్ కత్తాలో జన్మించాడు వివేకా… ఆయన అసలు పేరు నరేంద్ర నాథ్… రామకృష్ణ పరమహంస వద్ద శిష్యరికం తీసుకున్న తర్వాత స్వామి వివేక నందుడిగా ప్రసిద్ది చెందారు…

1902 42 బ్రిటీష్ పరిపాలనలో బెంగాల ప్రెసిడెన్సీ లోని బేలూరులోని రామకృష్ణ మఠంలో ఆయన మరణించారు… అప్పుడు ఆయన వయస్సు 39 సంవత్సరాలు. వివేకా భారతదేశాన్ని జాగృతము చెయ్యడమే కాకుండా అమెరికా, ఇంగ్లాండులలో యోగ, వేదాంత శాస్త్రములను తన ఉపన్యాసముల ద్వారా, వాదనల ద్వారా పరిచయం చేశారు.. గురువు కోరిక మేరకు అమెరికాకు వెళ్ళి అక్కడ హిందూ మత ప్రాశస్త్యం గురించి ఎన్నో ఉపన్యాసాలు చేశారు .

భారతదేశాన్ని ప్రేమించి, భారతదేశం మళ్ళి తన ప్రాచీన ఔన్నత్యాన్ని పోందాలని ఆశించిన వారిలో ముఖ్యులు స్వామి వివేకానందా ఒకరు. అతని వాగ్ధాటికి ముగ్ధులైన అమెరికా ప్రజానీకం బ్రహ్మరధం పట్టింది. ఎంతో మంది అతనికి శిష్యులయ్యారు. పాశ్చాత్య దేశాలలోకి అడుగు పెట్టిన మొదటి హిందూ సన్యాసి ఈయనే. తూర్పు దేశాల తత్త్వమును షికాగోలో జరిగిన ప్రపంచ మత జాతర పార్లమెంట్ ఆఫ్ వరల్డ్ రెలిజియన్స్ లో 1893 లో ప్రవేశపెట్టాడు. అక్కడే షికాగోలోను, అమెరికాలోని ఇతర ప్రాంతాలలోను ప్రజల అభిమానాన్ని చూరగొన్నాడు.

తిరిగి భారత దేశం వచ్చి రామకృష్ణ మఠాన్ని స్థాపించి దీని ద్వారా భారత యువతకు దిశా నిర్దేశం చేశాడు. ముప్పై తొమ్మిది ఏళ్ళ వయసు లోనే మరణించాడు. ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవం గా1984 లో ప్రకటించింది.