Sania Mirza |హైదరాబాద్‌లో సానియా మీర్జా ఫేర్ వెల్ మ్యాచ్.. ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్!

-

స్టార్ టెన్నీస్ ప్లేయర్ సానియా మీర్జా(Sania Mirza) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టోర్స్ ప్లేయర్‌ అయినా, హీరోయిన్లను మించిన ఫాలోయింగ్ ఆమె సొంతం. 20 ఏళ్ల పాటు టెన్నిస్ రంగంలో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె.. ఎన్నో రికార్డులు సృష్టించారు. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఆమె.. హైదరాబాద్లో ఈ ఆదివారం కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడనుంది. అదే ఆమెకు ఫేర్ వెల్ మ్యాచ్ కావడం విశేషం. ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. సొంత గడ్డపై ఫేర్ వెల్ మ్యాచ్ ఆడనుండటం సంతోషంగా ఉందని సానియా మీర్జా((Sania Mirza)) తెలిపింది. హైదరాబాద్‌తో తనకు ఎంతో అనుబంధం ఉందని చెప్పింది. రిటైర్మెంట్ తర్వాత ఫ్యామిలీకి అధిక సమయం కేటాయిస్తానని చెప్పుకొచ్చింది. అటు హోమ్ టౌన్లో అభిమానుల కోసం ఆడబోతున్న ఈ మ్యాచ్కు ఫుల్ క్రేజ్ ఏర్పడింది. 20 ఏళ్ల కెరీర్ తనకు సంతృప్తి ఇచ్చిందని అన్నారు. కాగా, 2003లో టెన్నిస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. 2023లో రిటైర్మెంట్ ప్రకటించింది.

- Advertisement -
Read Also: ఉగ్రవాదిని చూశా.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

HCU Land Issue | ‘రాబర్ట్ వాద్రా కోసం 400 ఎకరాల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం!!’

HCU Land Issue | కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు...

RRR Custodial Case | RRR కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం

టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో(RRR Custodial Case)...