40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

-

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. జైలు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహబూబాబాద్(Mahabubabad) మండలం కంబాలపల్లి గ్రామానికి చెందిన ఎస్. వీరన్న మహబూబాబాద్ లో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడు. ఈ కేసులో 1982లో ఉమ్మడి వరంగల్ జిల్లా కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. దీంతో వీరన్నను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించగా.. 1984లో పెరోల్ పై విడుదలయ్యాడు. అప్పటికి వీరన్న వయసు 27 ఏళ్లు. అప్పటి నుంచి జైలు అధికారులకు దొరకకుండా తిరుగుతున్నాడు.

- Advertisement -

40 ఏళ్ల అనంతరం తాజాగా అతడి ఆచూకీ లభించింది. గురువారం విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసుల సహకారంతో మహబూబాబాద్(Mahabubabad), వరంగల్ జైలు అధికారులు మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం పెద్దముప్పారంలో వీరన్నను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే చర్లపల్లి జైలుకు తరలించారు. మహబూబాబాద్ జైలర్ మల్లెల శ్రీనివాసరావు, వరంగల్ జైలు అధికారులు రామకృష్ణారెడ్డి, నాగరాజు, వార్డర్లు యాసిన్, రఘు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

Read Also: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

పెళ్ళై పిల్లలున్న వ్యక్తితో డేటింగ్‌పై సాయిపల్లవి క్లారిటీ

సాయి పల్లవి(Sai Pallavi) ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. నేచురల్ బ్యూటీగా...

అసెంబ్లీలో వాళ్లందర్నీ నిలబెట్టిన సీఎం..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని...